న్యూఢిల్లీ, నవంబర్ 29: కరోనా వ్యాక్సిన్ బూస్టర్, అదనపు డోసులపై సమగ్ర విధానాన్ని రెండు వారాల్లో ప్రకటిస్తామని కొవిడ్-19 టాస్క్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆయన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. బూస్టర్, అదనపు డోసులు ఎవరికి, ఎప్పుడు అవసరమనే విషయాలతో కూడిన సమగ్ర విధానంపై ఎన్టీజీఐ కసరత్తు చేస్తున్నదని అరోరా చెప్పారు. ‘రెండు డోసుల తర్వాత నిర్ణీత కాలవ్యవధిలో ఇచ్చేది బూస్టర్ డోస్. ప్రాథమిక డోసుల తర్వాత కూడా రోగ నిరోధక శక్తి పుంజుకోని వారికి ఇచ్చేది అదనపు డోసు’ అని ఆయన వివరించారు. దేశంలో 18 ఏండ్లలోపు పిల్లలు 44 కోట్ల మంది ఉన్నారని, వారికి వ్యాక్సినేషన్ కోసం సమగ్ర ప్రణాళిక రచించామని తెలిపారు.