పలు ప్రాంతాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వరంగల్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ ఏర్పడి 20 ఏండ్లయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్ నగరంలో నిర్వహించనున్న విజయగర్జన సభకు ఏర్పాట్లు మొదలయ్యా యి. 10 లక్షల మందితో నిర్వహించే ఈ సభ కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మంగళవారం గ్రేటర్ వరంగల్లోని న్యూ శాయంపేట, భట్టుపల్లి, తిమ్మాపూర్ శివార్లలోని ఖాళీ స్థలాలను పరిశీలించారు. సభాస్థలితోపాటు వాహనాల పార్కింగ్కు అనువైన స్థలాలను గుర్తించారు. రవాణా మార్గా లు, ఇతర ఏర్పాట్లపై నివేదిక రూపొందించి పార్టీ అధిష్ఠానానికి నివేదించనున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎక్కువ రోడ్లు అనుసంధానంగా ఉన్న విశాలమైన ఖాళీ స్థలాలను గుర్తించారు. గతంలో వరంగల్ నగరంలోని ప్రకాశ్రెడ్డిపేటలో రెండుసార్లు టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలు జాతీయ స్థాయిలో రాజకీయంగా రికార్డులను నమోదు చేశాయి. భారీ బహిరంగ సభలను నిర్వహించడంలో టీఆర్ఎస్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపును పొందింది. విజయగర్జన సభను ఇదే స్థాయిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ తమను ఆదేశించినట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వీరి వెంట గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు ఉన్నారు.
27 నాటి సీఎం సభకు ఏర్పాట్లు
ఎల్కతుర్తి, అక్టోబర్ 19: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 27న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సభ ఏర్పాట్లు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట శివారులో మొదలయ్యాయి. 25 ఎకరాల స్థలాన్ని చదును చేయిస్తున్నారు. మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సభ జరిగే ప్రదేశం, పార్కింగ్ స్థలాలు, హెలీపాడ్ ప్రదేశాలను పరిశీలించారు.