హైదరాబాద్ : రాష్ట్ర అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నగరంలోని సాలార్ జంగ్ మ్యూజియంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఇరాన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఇరాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ పర్షియన్ కవి హఫెజ్ పేరిట ఏర్పాటు చేసిన శివరాజ్ ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి, ఎగ్జిబిషన్ను తిలకించారు. కార్యక్రమంలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ హిస్ ఎక్ససెల్లెన్సీ మెహది షారోఖి, ప్రొఫెసర్ సయ్యద్ అనుల్ హసన్, వైస్ ఛాన్సలర్ మౌలానా ఆజాద్ జాతీయ విశ్వ విద్యాలయం, సాలర్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి, సియాసత్ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ హీర్ ఉద్దీన్ అలీఖాన్ పాల్గొన్నారు.