హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : హైటెక్స్ వేదికగా 12 నుంచి మూడు రోజుల పాటు పీహెచ్ఐసీ ఎక్స్పో నిర్వహించనున్నట్టు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమి ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి బుర్రి శనివారం తెలిపారు. ఇందులో తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పాల్గొంటున్నారని వెల్లడించారు. వైద్యారోగ్య రంగ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులూ పాల్గొంటారన్నారు. ‘లైఫ్ ఆఫ్టర్ ప్యాండమిక్’ నినాదంతో జరిగే ఈ సదస్సులో పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా, ఫ్యూచర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ తదితర అంశాలపై చర్చిస్తారని తెలిపారు.