కొల్లాపూర్ రూరల్, అక్టోబర్ 28: సమైక్య పాలనలో కొల్లాపూర్ ప్రాంతం విద్యాపరంగా పూర్తిగా వెనుకబడింది. ఈ ప్రాంతం వారు ఉన్నత చదువులు చదవాలంటే ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నాగర్కర్నూల్, జడ్చర్ల, కల్వకుర్తి, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ల్లాల్సి వచ్చేది. దీంతో చాలా మంది పేదలకు విద్య అందని ద్రాక్షగా ఉం డేది. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు కేవలం పదో తరగతి, ఇంటర్ వరకు చదివి ఆగిపోయే పరిస్థితి. తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేడయంతోపాటు స్థానిక ఎమ్మెల్యే బీరం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ప్రాం త వాసులకు ఉ న్నత విద్య అందుబాటులోకి వస్తున్న ది. ముఖ్యం గా ప్రభుత్వ విద్యావ్యవస్థ బలపేతం కోసం కరోనా కష్ట కాలంలో వి ద్యార్థుల డ్రాపౌట్ లే కుండా ఉండేందుకు ఎ మ్మెల్యే వినూత్నంగా తన సొం త డబ్బులు రూ. 10లక్షలు వెచ్చించి మండలంలోని చింతలపల్లి ప్రభుత్వ పాఠశాలను నిపుణులైన కళాకారులతో రైలు బం డిగా మర్చారు. మండలంలోని మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ పాఠశాలలను మా ర్చడంతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందుతున్నది. చింతలపల్లి ప్రభుత్వ పాఠశాల కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలతోపాటు, ఇతర ప్రాంతాలల్లోని పాఠశాలలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అందుబాటులో ఉన్నత విద్య..
గురుకుల విద్య కోసం మున్ననూర్, జేపీనగర్, చిట్యాల, నాగర్కర్నూల్, బీచుపల్లి, కొత్తకోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగోటం, కొల్లాపూర్లో గురుకుల విద్యా సంస్థలను, బీసీ రెసిడెన్షియల్ కళాశాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఏర్పాటు చేయించడంతో గురుకుల విద్య కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా ఉన్నత విద్య సైతం నల్లమల చివరి ప్రాంతంలోని విద్యార్థులకు అందుతున్నది. కొల్లాపూర్ ప్రాం తంలో పీజీ కళాశాల ఏర్పాటుతోపాటు పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయించడడంతో కొల్లాపూర్ నుంచి విద్య వలసలు ఆగిపోయి ఉన్నత విద్యావంతులు పెరుగుతున్నారు.
సాంకేతిక విద్య కేంద్రంగా..
చదువుల కోసం వలసలు వెళ్లే పరిస్థితి నుంచి కొల్లాపూర్లో ఉపాధి లభించే చదవులు కావాలంటే కొల్లాపూర్ కు వలసలు రావాల్సిన తప్ప ని పరిస్థితిని ఎమ్మెల్యే కల్పించారు. కొల్లాపూర్ లో మొదటగా ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలను సాధించారు. అం తేకాదు ఆడ్మిషన్లు ప్రా రంభమైన తర్వాత గత నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ కొల్లాపూర్కు వ చ్చిన సందర్భంలో డిప్లా మా పాలిటెక్నిక్ కళా శాలను సాధించి కొల్లాపూర్లో సాంకేతిక, ఉపాధి అవకాశాలు పు ష్కలంగా దొరికే విద్యా వ్యవస్థకు కేంద్రంగా మార్చారు. కొల్లాపూర్ మామిడి పంటలకు బ్రాండ్ అంబాసిటర్ కొల్లాపూర్లో 35వేల ఎకరాల్లో మామిడి పంటలు సాగవుతాయి. ఇక్కడ ఉద్యానవన కళాశాల ఏర్పాటుతో నూతన పం ట విధానం కొ త్త పంటల సృష్టికి కొల్లాపూర్ వేది క కావడంతో కొల్లాపూర్ కీర్తీ ప్రతిష్ట చరిత్రలో నిలవనున్నది. కొల్లాపూర్ సహజవనరులకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. ఇక్కడ డిప్లా మా పాలిటెక్నిక్ ఏ ర్పాటుతో కొల్లాపూర్ రాష్ట్ర, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతోపాటు కొల్లాపూర్ ప్రపంచ పటంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడనున్నది. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యం నేరవేరేందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కొల్లాపూర్ ప్రాంతాన్ని విద్యావనంగా మార్చుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, మేధావు లు అతితక్కువ కాలంలోనే విద్యాభివృద్ధికిఎ మ్మెల్యే బీరం చేస్తున్న కృషి ని హర్షించడంతోపాటు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.