న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పెట్రోల్ ధరలు 78 సార్లు, డీజిల్ ధరలు 76 సార్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్ధా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, గ్యాస్ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ఈ మేరకు సోమవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆ లేఖను రాఘవ్ చద్ధా ట్వీట్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకుంటోందని, దీనికి కేంద్ర మంత్రి సమాధానమే నిదర్శమని విమర్శించారు.
కాగా, దేశంలో నిత్యవసరాల నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్భణం పెరుగడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గత సోమవారం ప్రారంభమయ్యాయి. దీంతో ధరల పెరుగుదలపై చర్చ జరుపాలని సమావేశాల తొలి రోజు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర పెట్రోలియం, గ్యాస్ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ఇచ్చిన సమాధానం లేఖను చూసి ఆయన షాక్ అయ్యారు.
In reply to my question in Rajya Sabha, Central Government conceded that the prices of petrol and diesel have been hiked 𝟕𝟖 𝐓𝐈𝐌𝐄𝐒 and 𝟕𝟔 𝐓𝐈𝐌𝐄𝐒 respectively in the last one year. This is a clear confession by the Government of looting the common man. pic.twitter.com/4dz9DA7pQZ
— Raghav Chadha (@raghav_chadha) July 25, 2022