న్యూఢిల్లీ: అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించడంలో రిటర్నింగ్ అధికారులు(ఆర్వో) విచక్షణరహితంగా వ్యవహరించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీహార్లోని బంకా పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన జవహర్కుమార్ నామినేషన్ను ఆర్వో తిరస్కరించారు. దీనిని ఆయన సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. నామినేషన్ పత్రాల్లో లోపాలను సరిచేసేందుకు అభ్యర్థికి ఒక రోజన్నా కేటాయించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.