నిజాంసాగర్, జనవరి 24: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు కాసాల జైపాల్రెడ్డి (34) ఆత్మహత్య చేసుకొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్కు చెందిన జైపాల్రెడ్డి సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతం లో నిజాంసాగర్లో దూకారు. ఆత్మహత్యకు ముందు తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఫేస్బుక్, వాట్సాప్లో పోస్టులు పెట్టారు. ఆరోగ్య సమస్యతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన మిత్రులు, కుటుంబీకులు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది.