గుండాల, మార్చి 27 : ప్రజలంతా భక్తిభావం అలవర్చుకోవాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెల్మజాల గ్రామంలో బొడ్రాయి, దుర్గామాత పండుగకు హాజరై దుర్గామాత ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన వెంట సర్పంచ్ సంగి బాలకృష్ణ, ఎంపీటీసీ పొన్నగాని మహేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సైదులు, మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, నాయకులు సంగి వెంకటాద్రి, దాస ప్రసాద్, కె.దయాకర్, మొరిగాల బాలమల్లు, గిరికత్తుల శ్రీనివాస్, మాదరబోయిన శ్రీనివాస్, కాసం నగేశ్ ఉన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన కేసరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాదిగా వంగపల్లి గ్రామం క్రీడలకు నిలయంగా మారిందన్నారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో గ్రామానికి మరింత పేరు తీసుకురావాలని సూచించారు. జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచ్ కానుగు కవిత, ఎంపీటీసీ రేపాక మౌనిక, ఉపసర్పంచ్ రేపాక స్వామి, మదర్ డెయిరీ డైరెక్టర్ కల్లేపల్లి శ్రీశైలం, కేసరి యూత్ అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య, ఉపాధ్యక్షుడు పంపరి నర్సింగ్రావు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.