ఘట్కేసర్ రూరల్( మేడ్చల్) : ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ తప్పదని మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ పంచాయతీకి చెందిన పలువురు యాదవ సంఘం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేసి సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కారు జోరు కొనసాగుతుందని, అభివృద్ధి తెలియని కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తే కాంగ్రెస్కు పతనం తప్పదన్నారు. ప్రభుత్వ ఆర్థిక, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓటర్లను చైతన్యపర్చాలని పార్టీలో చేరిన నాయకులకు సూచించారు.
బీఆర్ఎస్లో చేరిన వారు..
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ఉపాధ్యక్షుడు ముద్దం భాస్కర్తో పాటు కాంగ్రెస్ నాయకులు ముంత రంగయ్య, యాదగిరి, కృష్ణ, జంగయ్య, నరసింహ, అయిలయ్య, కొత్త బాబు, బంగారి, రాజు, కృష్ణ, విద్యాసాగర్, రమేశ్, మల్లేష్, శ్రీశైలం, వెంకటేశం, మహేష్, అంజనేయులు తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి, మాజీ సర్పంచ్ బైరు రమాదేవి, ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.