కందుకూరు, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఆడపడుచులను పెద్దన్నగా ఆదుకుంటున్నారని తెలిపారు. కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం 101 మందికి కోటి రూపాయలకు పైగా కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, తాసీల్దార్ జ్యోతి, జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మన్ విజేందర్రెడ్డి, ఎంసీటీసీ ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, స్థానిక సర్పంచ్ సురుసాని శమంతకమణి, డైరెక్టర్లు, సామ ప్రకాశ్రెడ్డి, ఆనంద్, పాండురంగారెడ్డి, నర్సింహ, వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, లక్ష్మీనర్సింహారెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తిక్, అశోక్ ముదిరాజ్, బర్కం వెంకటేశ్, నియోజకవర్గం ఎస్సీ విభాగం నాయకులు చిర్ర సాయిలు, రాయిచెట్టు యాదయ్య, ఎంపీటీసీలు జ్యోతి, రాములు, సర్పంచ్లు పరంజ్యోతి, రామకృష్ణారెడ్డి, జ్యోతి, ఏనుగు శ్రావణి, సదాలక్ష్మీ పుల్లారెడ్డి, బాలమణి, గోపాల్రెడ్డి, నాయకులు ఈశ్వర్గౌడ్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి కృషి
మహేశ్వరం, డిసెంబర్ 29: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నికైన నిమ్మగూడెం సుధీర్గౌడ్కు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాలయాలను అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. సభ్యులుగా కరోళ్ల చంద్రయ్యముదిరాజ్, మిద్దింటి బాల్రాజ్, పేయల యాదమ్మ, కరోళ్ల రవీందర్, కూన వెంకటేశ్, కటికెల మహేందర్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్అలీ, మండల రైతు బంధు చైర్మన్ పరిగి రాఘవేందర్రెడ్డి, నాయకులు ఆనందం, నవీన్, ఎంఏ సమీర్, మద్ది కరుణాకర్రెడ్డి, వర్కల యాదగిరిగౌడ్, దోమ శ్రీనువాస్రెడ్డి, దుడ్డు కృష్ణ, ఎస్కే ఆజాం, కుమార్, మనోహార్, కటికల మైసయ్య, వీరిబాబు, సున్నం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడలో ఇరుమూడి పూజలు
కందుకూరు, డిసెంబర్ 29: కొత్తగూడ గ్రామంలో అయ్యప్ప భక్తులు బుధవారం రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద పడిపూజ నిర్వహించారు. అనంతరం 16మంది అయ్యప్పలు శబరికి బయలుదేరారు. అయ్యప్పలకు చందర్ నాయర్, ఎట్టయ్య గురుస్వామలు ఇరుమూడి కట్టి పూజలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పూజలో పాల్గొన్నారు. బీజేపీ రంగారెడ్డి అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, ఎంపీటీసీ జ్యోతి, డైరెక్టర్ సామ ప్రకాశ్రెడ్డి, మాజీ సర్పంచ్లు రాయిచెట్టు యాదయ్య, మాధవరెడ్డి, ఎట్టయ్య గురుస్వామి, సత్యనారాయణరెడ్డి గురుస్వామి, మల్లారెడ్డి, శేఖర్ గౌడ్, నాగేశ్వర్రెడ్డి, కృష్ణారెడ్డి, సుధీర్రెడ్డి, సురేందర్రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, గురుస్వాములు భక్తులు పాల్గొన్నారు.