కార్డ్ టోకనైజేషన్ కోసం టై-అప్
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: తమ ఖాతాదారుల డాటా రక్షణార్థం కార్డ్ టోకనైజేషన్ కోసం పేటీఎంతో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ జట్టు కట్టింది. పేటీఎం ద్వారా చెల్లింపులకు, మొబైల్స్పై డెబిట్, క్రెడిట్ కార్డుల టోకనైజ్కు వీలుగా టై-అప్ అయ్యింది. యూనిక్ క్యారెక్టర్ల సమూహంతో ఒరిజినల్ కార్డ్ నంబర్ను కనిపించకుండా భద్రంగా ఉంచే ప్రక్రియే టోకనైజేషన్. లావాదేవీ జరుగుతున్నప్పుడు కస్టమర్ల కార్డ్ వివరాలు ఈ టోకన్తో సురక్షితంగా ఉంటాయి. కార్డ్ టోకనైజేషన్ సదుపాయం.. ఆండ్రాయిడ్ ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) డివైజెస్పైనే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ కార్డ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం పేటీఎం నెట్వర్క్పై భారత్లో జారీ చేసిన కార్డులను మాత్రమే అనుమతిస్తున్నాం. అంతర్జాతీయ లోకేషన్లలో పేటీఎం నెట్వర్క్ ద్వారా ఎస్బీఐ కార్డులను కస్టమర్లు వినియోగించుకోవచ్చు అన్నది.