న్యూఢిల్లీ, మార్చి 26: రాష్ట్రంలో బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన రూ.1.36 లక్షల కోట్ల బకాయిలను చెల్లించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నెల 2వ తేదీన రాసిన లేఖను ఆయన శనివారం ట్వీట్ చేశారు. ‘బకాయిలపై బొగ్గు గనుల మంత్రిత్వశాఖ, నీతిఆయోగ్ను ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేక చివరికి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.