హైదరాబాద్ : భారత్ అండర్ -19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. పవన్ కల్యాన్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్సెలెన్స్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సాయం అందించారు. జనసేన నాయకులు గుంటూరులోని రషీద్ నివాసానికి మంగళవారం వెళ్లి పవన్ తరఫున చెక్కు అందజేశారు. పవన్ తరఫున అభినందనలు తెలిపారు. త్వరలో రషీద్ను పవన్ కల్యాణ్ కలుస్తారని పార్టీ నేతలు చెప్పారు.