బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ ఫైనల్కు దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి సెమీస్లో మాజీ చాంపియన్ పట్నా 38-27 తేడాతో యూపీ యోధాపై అద్భుత విజయం సాధించింది. తుది పోరులో నిలువడం ద్వారా పట్నా రికార్డు స్థాయిలో నాలుగో టైటిల్పై కన్నేసింది. మ్యాచ్ విషయానికొస్తే..ఆది నుంచి తమదైన దూకుడు కనబరిచిన పైరేట్స్ తరఫున గుమన్ సింగ్ (8), సచిన్ (7), మహమ్మద్ రెజా (6) రాణించారు. మరోవైపు యూపీ జట్టులో స్టార్ రైడర్ పర్దీప్ నార్వల్ (4) నిరాశపరుచగా, శ్రీకాంత్ జాదవ్ (10) ఒంటరి పోరాటం చేశాడు. మరో సెమీస్ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 40-35 తేడాతో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. ఢిల్లీ తరఫున నవీన్కుమార్ (14) టాప్ స్కోరర్గా నిలువగా, నీరజ్ నార్వల్ (5), విజయ్ (4) ఆకట్టుకున్నారు. కెప్టెన్ పవన్ షెరావత్ (18) వన్మ్యాన్ షో బెంగళూరును గెలిపించలేకపోయింది. పవన్కు సహచర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో బెంగళూరు ఓటమి వైపు నిలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో పట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి.