గాంధీనగర్: పాటిదార్ ఉద్యమనేత హార్థిక్ పటేల్ ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో హార్ధిక్ పటేల్ ఆ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కూడా పాల్గొన్నారు.
ఇవాళ్టి నుంచి దేశం.. ప్రాంతం.. సమాజం కోసం కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానని, ప్రధాని మోదీ నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి పనుల్లో చిన్నపాటి సైనికుడిలా పనిచేస్తానని హార్థిక తన ట్వీట్లో తెలిపారు. 2015లో పాటిదార్ ఉద్యమాన్ని నడిపిన హార్ధిక్.. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఏడాది మే 18వ తేదీన ఆ పార్టీకి వీడ్కోలు పలికారు.