తిరుపతి, జూలై : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.
ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు స్వామివారికి ఆణివార ఆస్థానం జరిగింది. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని వేంచేపు చేసి యాదవ హారతి , క్షేమతలిగ, ఆస్థానం, నివేదన నిర్వహించారు