కోల్కతా: బెంగాల్లో జరిగిన టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈడీ 172 పేజీల ఛార్జిషీట్ను తయారు చేసింది. దాంట్లో అనేక సంచలన విషయాలను వెల్లడించింది. పిల్లలు కావాలనుకున్న అర్పితా ముఖర్జీ.. దత్తత లేఖపై మంత్రి పార్ధా ఛటర్జీ సంతకం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకివచ్చింది. థాయిలాండ్లో పార్థాకు ఓ లగ్జరీ బంగ్లా ఉన్నట్లు ఈడీ తన రిపోర్ట్లో తెలిపింది. ఆ ఇంటి ఓనర్షిప్ పేరులో అర్పిత పేరు కూడా ఉన్నట్లు తేల్చారు. ఏపీఏ యుటిలిటీ సర్వీసెస్ పేరుతో థాయ్ ఇంటిని కొనుగోలు చేశారు. యుటిలిటీ సర్వీసెస్లో అర్పిత, పార్ధాలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన 14640 పేజీల డాకుమ్యెంట్ను కూడా ఈడీ కోర్టుకు సమర్పించింది.