న్యూఢిల్లీ, నవంబర్ 23: పార్లే ప్రొడక్ట్స్..కొనుగోలుదారులకు షాకిచ్చింది. అన్ని రకాల ఉత్పత్తుల ధరలను 5 శాతం నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరుగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. ముఖ్యంగా ముడి సరుకులైన చక్కెర, గోధుమ, వంటనూనెల ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో పార్లే జీ, హైడ్అండ్ సీక్, క్రాక్జాక్ ధరలు 5-10 శాతం వరకు పెరుగగా, రస్క్, కేక్ 7-8 శాతం వరకు ప్రియమయ్యాయి.