పారిస్: ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పారిస్ మాస్టర్స్ టైటిల్ను ఆరోసారి కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 4-6, 6-3, 6-3తో డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. తొలి సెట్ కోల్పోయిన అనంతరం దెబ్బతిన్న పులిలా విజృంభించిన జొకో.. వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇరువురు ఆటగాళ్లు ఆరేసి ఏస్లు బాదగా.. బ్రేక్ పాయింట్ల విషయంలో మెరుగ్గా నిలిచిన జొకోను విజయం వరించింది. బలమైన సర్వీస్లతో పాటు.. నెట్గేమ్తో చెలరేగిన సెర్బియా వీరుడు ఆరో టైటిల్ చేజిక్కించుకోవడంతో పాటు.. యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు.