ఆ రైతు అందరిలా వరినే సాగు చేయాలని మూస ధోరణిలో ఆలోచించలేదు. ఎప్పుడూ ఒకే తరహా పంటలు పండించి ఒడిదుడుకులు ఎదుర్కోవాలని అనుకోలేదు. భిన్నంగా ఆలోచించాడు. వినూత్న ప్రయోగాలతో విభిన్న సాగుకు ఉపక్రమించాడు. బీడు భూమికి సాగుకళ తీసుకొచ్చి సిరులు పండిస్తున్నాడు. మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చెర్రీ టమాట, కీర దోస, క్యాప్సికమ్లాంటి కూరగాయలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి అధిక దిగుబడులు పొందుతున్నాడు. నెలకు రూ.50వేల ఆదాయాన్ని ఆర్జించడమే గాక, మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాడు తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన పాంగాల బాలస్వామి.. ఆయన చేస్తున్న కొంగొత్త ప్రయోగాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..