కొండమల్లేపల్లి, ఏప్రిల్ 2: పండుగ పూట విషాదం చోటుచేసుకొన్నది. ప్రమాదవశాత్తు పల్లీ మెషిన్ ఫ్యాన్ తగలడంతో తల తెగడంతో బాలుడు దుర్మరణం చెం దాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గాజీనగర్లో శనివారం జరిగింది. గ్రా మానికి చెందిన పేట జాన్-రాణి దంపతులకు ఇద్దరు కొడుకులు. జాన్ తన వ్యవసాయ భూమిలో పల్లీ సాగు చేశాడు. శనివారం పొలం వద్ద మెషిన్తో శనగలు దూస్తుండగా.. జాన్ చిన్న కొడుకు మధు(7) మెడకు చున్నీ వేసుకొని మెషిన్ ఫ్యాన్కు సమీపానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చున్నీ ఫ్యాన్కు చుట్టుకొని మధు తల తెగి పడింది. కండ్ల ముందే కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.