జైపూర్ : భౌగోళిక సరిహద్దులు చెరిపేస్తూ ఇటీవల పలు వివాహాలు జరుగుతున్న క్రమంలో ఈ తరహా ఘటన మరొకటి వెలుగుచూసింది. పాకిస్తాన్ మహిళకు భారత వీసా లభించకపోవడంతో జోధ్పూర్కు చెందిన వ్యక్తిని ఆమె వర్చువల్గా వివాహం చేసుకున్నారు. కరాచీకి చెందిన అమీనా రాజస్ధాన్కు చెందిన అర్బాజ్ ఖాన్తో ప్రేమలో పడింది.
అతడిని పెండ్లి చేసుకునేందుకు భారత్ రావాలనుకుంది. ఇండియన్ వీసా లభించకపోవడంతో అర్బాజ్ను ఆమె వర్చువల్గా పెండ్లి చేసుకుంది. పాకిస్తాన్లో తాను అమీనాను పెండ్లి చేసుకోలేనని, ఎందుకుంటే దాన్ని గుర్తించనందున తాము తిరిగి భారత్లో మళ్లీ పెండ్లి చేసుకోవాల్సి ఉంటుందని అర్బాజ్ చెప్పుకొచ్చాడు. అమీనా వీసా కోసం దరఖాస్తు చేస్తుందని తెలిపాడు.
వృత్తి రీత్యా సీఏగా పనిచేస్తున్న అర్బాజ్ పెండ్లి వేడుకలో పాల్గొనేందుకు సంప్రదాయ దుస్తుల్లో జోధ్పూర్లోని ఓస్వాల్ సమాజ్ భవన్కు స్నేహితులు, కుటుంబసభ్యులతో చేరుకున్నాడు. వర్చువల్గా నిఖా జరగడంతో పాటు కుటుంబసభ్యులు సంప్రదాయబద్ధంగా నిర్వహించాల్సిన లాంఛనాలను పూర్తిచేశారు.
జోధ్పూర్ ఖ్వాజి ఈ వివాహం జరిపించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అని పాకిస్తాన్లోని తమ బంధువులు ఈ సంబంధం ఫిక్స్ చేశారని చెప్పాడు. భారత్, పాక్ల మధ్య సంబంధాలు ప్రస్తుతం బాగాలేనందునే నిఖా ఆన్లైన్లో నిర్వహించామని అన్నాడు. అమీనాకు త్వరలోనే వీసా లభించి భారత్కు వస్తుందని అర్బాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read More :