న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇప్పటికే దివాలా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వస్థలం సియోల్కోట్లో ఆయన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్థిక దుస్థితి రావడానికి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, అధికారులే కారణమని ఆరోపించారు.
ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో దేశం తన కాళ్లమీద తాను నిలబడటం చాలా ముఖ్యమన్నారు. విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయని, మీరంతా దివాలా తీసిన దేశంలో ఉన్నారని ఆయన అక్కడి వారిని ఉద్దేశించి పేర్కొన్నారు.