న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. సోమవారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నీరజ్ అవార్డు స్వీకరించాడు. టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించిన ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్), సుమిత్ అంటిల్(జావెలిన్ త్రో) దేశ నాలుగో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. కోట్లాది మంది అభిమానుల అంచనాలు నిజం చేస్తూ నీరజ్చోప్రా స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.