దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘కథలు’ (మీవి మావి). సతీష్ వేగేశ్న, దుష్యంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్లో మొదటి కథ ‘పడవ’ మోషన్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్ ఈ మోషన్ పోస్టర్ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కథలో సమీర్ వేగేశ్న, ఈషా రెబ్బ జంటగా నటించారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటిదాకా మూడు కథలు చిత్రీకరణ జరుపుకొన్నాయి. మరికొన్ని కథలను త్వరలో తెరకెక్కించనున్నారు. ‘కథలు’ (మీవి మావి) త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ వెబ్ సిరీస్కు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘కోతి కొమ్మచ్చి’, ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అనే చిత్రాలను రూపొందిస్తున్నారు.