చండీగఢ్ : పంజాబ్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు భారీ ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. అమృత్సర్ జిల్లాలోని పాక్ అంతర్జాతీయ సరిహద్దులో రూ.200కోట్ల విలువైన 40.810 కిలోల హెరాయిన్ను పట్టుకున్నారు. బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్, స్థానిక పోలీసుల బృందం రామదాస్ సెక్టార్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్లో పంజ్గ్రేయన్ ప్రాంతం నుంచి 90 గ్రాముల ఓపియమ్, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారని అమృత్సర్ రూరల్ ఎస్ఎస్పీ పేర్కొన్నారు. తెల్లవారు జామున గుల్నీత్ ఖురానా నేతృత్వంలోని బృందం ఇండో – పాక్ సరిహద్దులో ఆపరేషన్ చేపట్టి, 40కిలోలకుపైగా హెరాయిన్ రికవరీ చేసుకున్నట్లు డీజీపీ దినకర్ గుప్తా ట్వీట్ చేశారు. మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి పక్కాగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్ల చెప్పారు.