ముంబై: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో సుమారు 150 మంది గాయపడ్డారు. దహి హండి వేడుకల సమయంలో మానవ పిరమిడ్ నిర్మిస్తున్న సందర్భంలో గోవింద పాఠకులు గాయపడ్డారు. గాయపడ్డ 153 మందిలో.. 130 మందికి చికిత్స అందించామని, ఇంకా 23 మంది హాస్పిటల్లో ఉన్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. థానేలో కూడా 64 మంది గోవింద పాఠకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దహి హండీ వేడుకల సమయంలో వీళ్లంతా గాయపడ్డారు.