మూసాపేట, మార్చి 18 : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఏవ్లా తాలూకాలో ఉద్యాన పంటల పరిశీలనకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి వెళ్లారు. తెలంగాణలో ఉద్యాన పంటల పెంపకాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పర్యటనకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో పాటు సంబంధిత అధికారులు, ఎమ్మెల్యేలు పక్క రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. అక్కడ ఎ లాంటి పంటలు సాగు చేస్తున్నారు.. అందరూ ఒకే రకం పంటలు వేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.. వస్తున్న సమస్యలు, లా భాలపై స్వయంగా క్షేత్రస్థాయిలో రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఉద్యాన పంటల సాగు వివరాలను అక్కడి రైతులను అ డిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని రైతులకు లాభసాటి పంటల సాగుకోసమే అధ్యయనం చేయడానికే పర్యటనకు వచ్చినట్లు ఎమ్మెల్యే ఫోన్లో తెలిపారు.