అమరావతి : పీఆర్సీ సాధన కోసం ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వా్నికి సహాయ నిరాకరణ కొనసాగుతుంది. ఒకవైపు ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే మరోవైపు తమ ఆందోళనను కొనసాగిస్తామని సాధన సమితి నాయకులు వెల్లడించిన నేపథ్యంలో ఉద్యోగులు విధులకు హాజరై పనిచేయలేదు.
మరో వైపు సమ్మెకు మద్దతు ఇస్తూనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. విశాఖ, ప్రకాశం, విజయవాడ, కృష్ణా, కడప తదితర జిల్లాలోనూ ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలు నిర్వహించారు.