సిద్దిపేట (మార్చి 28) : సీఎం కేసీఆర్ ట్రోఫి సీజన్-2లో భాగంగా ఆచార్య జయశంకర్ స్టేడియంలో జరుగుతున్న రెండో రౌండ్ క్రికెట్ మ్యాచ్లో ఆయా జట్ల మధ్య మ్యాచ్లు పోటా పోటీగా సాగుతున్నాయి. ఆదివారం నైట్ జరిగిన మ్యాచ్లలో వెంకటాపూర్ జట్టుపై విఠలాపూర్ జట్టు, ఆర్బీకే జట్టుపై కేఎన్ఆర్ -1 జట్టు విజయం సాధించాయి. సోమవారం జరిగిన మ్యాచ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఆడినందుకు ఐఎంఎల్ డిపో జట్టును క్రాస్ చేసి అరుంధతి నారాయణరావుపేట జట్టును విజేతగా ప్రకటించారు.
అంకంపేట కింగ్స్ జట్టుపై గంగాపూర్ ఫ్రెండ్స్ జట్టు, ఎంఎస్సీ జట్టుపై టీహెచ్ఆర్ రావురూకుల జట్టు, టీహెచ్ఆర్ రాజ్గోపాల్పేట జట్టుపై రాంపూర్ జట్లు విజయం సాధించాయి. ఆయా మ్యాచ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు నిర్వాహకులు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆవార్డులు అందజేశారు.