గుంటూరు: గుంటూరు శివారు గోరంట్ల ఇన్నర్ రింగ్రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో నల్లపాడు పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.