ముంబై: ముంబై నగరంలో కరోనా సోకిన పేషెంట్ల శ్యాంపిళ్లను పరీక్షించగా.. దాంట్లో 95 శాతం మందిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు నిర్ధారించారు. డిసెంబర్ నెలలో కరోనా వ్యాప్తి సమయంలో సేకరించిన శ్యాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒమిక్రాన్ విస్తృతంగా ప్రబలినట్లు గ్రహించారు. మొత్తం 190 మంది శ్యాంపిళ్లను పరీక్షించగా.. 180 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ముగ్గురిలో డెల్టా వేరియంట్, ఇతరుల్లో మరికొన్ని రకాల వేరియంట్లను గుర్తించినట్లు బృహణ్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొన్నది. శ్యాంపిళ్లు సేకరించిన 190 మందిలో 23 మంది మరణించారు. వారిలో 21 మందికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు.