వాటికన్ సిటీ: యూరోప్ టూర్లో ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ వాటికన్ సిటీలో క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ను కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మును ఎంపిక చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నవీన్ పట్నాయక్ తన ట్విట్టర్లో స్పందిస్తూ ఆమెకు కంగ్రాట్స్ తెలిపారు. ఇది ఒడిశా ప్రజలకు గర్వకారణమన్నారు.