టేకులపల్లి జనవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు చేసిన సంఘటన స్థానికంగా కలకలంరేపాయి. టేకులపల్లి మండలంలోని లచ్చ తండాలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
లచ్చా తండా గ్రామంలో ఓ ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు చేసిన గుర్తులు కనిపించాయి. ఎర్రటి మూటలు, నల్లటి మూటలు కట్టి, అందులో వివిధ పూజ సామగ్రిని పెట్టి పూజలు నిర్వహించిన గుర్తులున్నాయి. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, చిల్లర పైసలు, ఎర్రటి, నల్లటి వస్త్రాలతో యంత్రాల లాగా కట్టి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీనిని చూసేందుకు చుట్ట పక్కల గ్రామాల ప్రజలు వస్తుండటం విశేషం.