కావలసిన పదార్థాలు
అరటిపండ్లు: రెండు, ఓట్స్: ఒక కప్పు, పాలు: ఒక కప్పు, పచ్చి ఖర్జూర: పావుకప్పు.
తయారీ విధానం
స్టవ్మీద పాన్పెట్టి ఓట్స్ను దోరగా వేయించి చల్లార్చాలి. మిక్సీ జార్లో వేయించిన ఓట్స్, గింజలు తీసి ముక్కలు చేసుకున్న ఖర్జూరాలు, తొక్కతీసిన అరటిపండ్లు, పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని గ్లాసులో తీసుకుని పైనుంచి అరటిపండు ముక్కలు, వేయించిన ఓట్స్ చల్లుకుంటే ఆరోగ్యకరమైన ఓట్స్ బనానా స్మూతీ రెడీ. చల్లగా తాగాలనుకుంటే కాసేపు ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు.