అబుధాబి: కివీస్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో కివీ పేసర్ సౌథీ ఇంగ్లండ్కు షాకిచ్చాడు. నిలకడగా ఆడుతున్న డేవిడ్ మలన్ (30 బంతుల్లో 41)ను పెవిలియన్ చేర్చాడు. స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
అతను లేకపోవడంతో జాస్ బట్లర్ (29), జానీ బెయిర్స్టో (13) ఓపెనింగ్ చేశారు. వీరిద్దరూ జట్టుకు నిలకడైన ఓపెనింగ్ అందించారు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మలన్ (41), మొయీన్ అలీ (26 నాటౌట్) కూడా రాణించడంతో ఇంగ్లండ్ జట్టు మంచి స్కోరు చేసేలా కనిపిస్తోంది.
ఈ క్రమంలో 16 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కివీస్ బౌటర్లల ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, సౌథీ తలో వికెట్ కూల్చారు.