రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్( NQAS Certificate) సర్టిఫికెట్ వచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కు గురువారం ధ్రువపత్రo అందింది. గతంలో జిల్లాలోని వేములవాడ, పీఎస్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, కోనారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా ఎన్క్వాస్ గుర్తింపు దక్కింది.
తాజాగా తంగళ్ళపల్లికి కూడా సర్టిఫికేట్ రావడం పట్ల జిల్లా కలెక్టర్ అనురాగ్(Collector) జయంతి హర్షం వ్యక్తం చేశారు.నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను చేరుకొంటే ఎన్క్వాస్ సర్టిఫికెట్ వస్తుందని, దీనికి మూడేండ్ల వ్యాలిడిటీ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రత్యేక చొరవతో పీహెచ్సీలల్లో అధునాతన పరికరాల(Advanced equipment)తో వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయని వివరించారు.