న్యూఢిల్లీ : కొవిడ్ టీకాలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా సోకి కోలుకున్న తర్వాత మూడు నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేయాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఫస్ట్, సెకండ్ డోస్తో పాటు ప్రికాషన్ డోసులకు ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఎవరైనా వ్యక్తికి కరోనా పాజటివ్గా వస్తే.. మళ్లీ నెగెటివ్ వచ్చిన మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్యమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాష్ షీల్ లేఖలో సూచించారు.
ఈ నిబంధన ప్రికాషన్ డోసుకు వస్తుందని, శాస్త్రీయ ఫలితాల ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లు కేంద్రం లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జనవరి 3 నుంచి కేంద్రం 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ నెల 10 నుంచి వృద్ధులు, ఫ్రంట్లైన్ కార్మికులకు మూడో డోసు టీకా వేస్తున్నది. కొవిడ్ బారినపడిన వారికి సాధారణ డోసులు సహా ప్రికాషన్ డోసులు వేసే విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని వచ్చిన అభ్యర్థలన మేరకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.