హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కే చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదిస్తూ పలువురు పార్టీ జడ్పీ చైర్మన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ ఎన్నారై విభాగం నాయకులు నామినేషన్లు దాఖలుచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డికి కార్పొరేషన్ల చైర్మన్లు రసమయి బాలకిషన్, బాజిరెడ్డి గోవర్ధన్, గ్యాదరి బాలమల్లు, అయాచితం శ్రీధర్, వంటేరు ప్రతాప్రెడ్డి, అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, సలీం, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, సంపత్కుమార్ నామినేషన్ పత్రాలు అందజేశారు. జడ్పీ చైర్మన్లు పట్నం సునీతా మహేందర్రెడ్డి, పుట్ట మధు, ఎలిమినేటి సందీప్రెడ్డి, కోరం కనకయ్య, కోవ లక్ష్మి, సుధీర్కుమార్, దాదన్నగారి విఠల్రావు, వేలేటి రోజారాణి, నల్లాల భాగ్యలక్ష్మి, గండ్ర జ్యోతి, గుజ్జ దీపిక, బిందు తదితరులు నామినేషన్ దాఖలుచేశారు. టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, దక్షిణాఫ్రికా టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, ఆస్ట్రియా అధ్యక్షుడు మేడిపల్లి వివేక్రెడ్డి, కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, ఫిన్లాండ్ అధ్యక్షుడు సందీప్రెడ్డి, మాల్దీవ్స్ అధ్యక్షుడు రాకేశ్, యూకే శాఖ నుంచి రత్నాకర్ కడుదుల, రమేశ్ ఎస్సంపల్లి, ఇటలీ నుంచి టీఆర్ఎస్ నాయకుడు వినయ్, జాంబియా విభా గం అధ్యక్షుడు రాహుల్రెడ్డి, వియత్నాం నుంచి క్రాంతికుమార్ నామినేషన్లు అందజేశారు.