అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో తాము భాగస్వామ్యులమౌతున్నామని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. తాము ఆందోళనలో పాల్గొంటున్నందున ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయమని స్పష్టం చేస్తూ ఏపీ ట్రెజరీ డైరెక్టర్కు ఓ లేఖను రాశారు.
వేతన బిల్లులు సహా ఇతర ప్రభుత్వ బిల్లులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఒత్తిళ్లు చేస్తుందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేతన బిల్లులను ప్రాసెస్ చేయమని సంఘం నాయకులు స్పష్టం చేశారు. కాగా ఉద్యోగుల ఆందోళనకు రాష్ట్ర న్యాయ ఉద్యోగుల సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు.