బీజింగ్, మార్చి 18 : ఇరాన్పై యుద్ధం మొదలైన తర్వాత.. ప్రపంచ దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనా లాంటి దేశాలు సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనటంపై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘సింథటిక్ పెట్రోలియం’ను ఉత్పత్తి చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన ఒక పద్ధతిని కనుగొన్నట్టు షాంఘైకి చెందిన ‘కార్బోనాలజీ’ అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది.
దీనిపై ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వార్తా కథనం ప్రకారం, గాలి, నీరు నుంచి కార్బన్డయాక్సైడ్, హైడ్రోజన్ను గ్రహించి.. దాన్ని కృత్రిమ ఇంధనంగా మార్చే ఒక పద్ధతిని అభివృద్ధి చేసినట్టు ‘కార్బోనాలజీ’ ప్రకటించింది.