గ్వాలియర్: దేవీ నవరాత్రోత్సవాలకు సమయం దగ్గర పడింది. ఇక గర్బా డ్యాన్స్లకు వేదికలు సిద్ధం కానున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి ఉషా థాకూర్ వార్నింగ్ ఇచ్చారు. గర్బా వేదికలకు వస్తున్న ప్రతి ఒక్కరూ ఐడీ కార్డులతో రావాలని మంత్రి ఉషా హెచ్చరికలు జారీ చేశారు. లవ్ జిహాద్ ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్నాయని, గర్బా పందిళ్లు లవ్ జిహాద్కు వేదికలుగా మారుతున్నాయని, అందుకే ఐడీ కార్డు లేకుంటే ఎవర్నీ అనుమతించబోమని మంత్రి అన్నారు.