హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్కూళ్లపై కొవిడ్ ప్రభావం కనిపించడం లేదు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాక 57 రోజు ల్లో 195 పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి ఇవి ప్రారంభంకాగా, రోజుకు లక్షల మంది విద్యార్థులు తరగతులకు హాజరవు న్నారు. ప్రభుత్వ బడుల్లో 60, ప్రైవేట్లో 35 శాతం వరకు వస్తున్నారు. ఈ మూడు నెలల్లో సెలవులు మినహాయిస్తే 57 రోజులు తరగతులు జరగ్గా, అక్క డక్కడా అడపాదడపా మాత్రమే కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 3,109 పాఠశాలల్లో 6,84,010 విద్యార్థులకు కొవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వ హించగా.. 195 పాజిటివ్ కేసులే నమోదయ్యాయి. కొవిడ్ కేసులు పెద్దగా లేకపోవడంతో ప్రత్యక్ష తరగతులు ఇలాగే సజావుగా కొనసాగనున్నాయి.