న్యూఢిల్లీ, మార్చి 11: అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్కు స్పష్టం చేశారు. ‘టారిఫ్లను తగ్గించడానికి భారత్ అంగీకరించింది’ అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయన పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని, ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆయన తెలిపారు.