నమస్తే తెలంగాణ యంత్రాంగం, నవంబర్ 25: అర్హులకే పోడు భూముల హక్కు పత్రాలు వస్తాయని గాంధారి జడ్పీటీసీ శంకర్నాయక్ అన్నారు. గాంధారి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సంజీవ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అర్హుల గుర్తింపు కోసం అధికారులు గ్రామాల్లో పోడు భూముల సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గాంధారి సింగిల్ విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, అటవీ హక్కుల కమిటీ గ్రామ చైర్మన్ సంగని బాలయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తాఫా, ఉపసర్పంచ్ రమేశ్, వార్డు సభ్యులు నితిన్రావు, లైని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్, మెల్లకుంటతండా, బంజర గ్రామ పంచాయతీల పరిధిలో ఎంపీడీవో రఘు ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో వచ్చిన పోడు భూముల దరఖాస్తులను పరిశీలించారు. గ్రామ సభల్లో ఎంపీపీ రాజదా స్, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని కన్నాపూర్, జల్దిపల్లి గ్రామాల్లో పోడు భూములపై గ్రామ సభలు నిర్వహించారు. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారి అన్నారు. 2005 సంవత్సరానికి ముందు సాగులో ఉన్న వారికి మాత్రమే పోడు భూముల పట్టాలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అటవీశాఖ అధికారులు, గిరిజనులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్ గ్రామంలో పోడుభూముల సర్వేపై సర్పంచ్ రేఖ అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పోడు రైతులు అందజేసిన దరఖాస్తులు, సర్వే వివరాలను అధికారులు గ్రామసభలో వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, సర్పంచులు భాస్కర్, శ్రావణ్కుమార్, పంచాయతీ కార్యదర్శులు సురేశ్, రవి, వినోద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామంలో పోడు భూములపై గ్రామ సభ నిర్వహించారు. 237 మంది జాబితాను పోలీసులు, ఫారెస్టు, రెవెన్యూ, ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామస్తులకు చదివి వినిపించారు. ఎంపీపీ పాల్త్య విఠల్, తహసీల్దార్ భావయ్య, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, గిర్దావర్ అంజు, సర్పంచ్ పాల్త్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్, నడిమితండా, ఎల్లంపేట, దుర్గమ్మగుడి, చెరువుముందు తండా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో బాలకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
నిజాంసాగర్ మండలంలోని మల్లూర్, మగ్దుంపూర్, జక్కాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పోడు భూముల గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా గిర్దావర్ విజయ్కుమార్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మల్లూర్ గ్రామసభలో వైస్ ఎంపీపీ మనోహర్, సర్పచ్ ఖాసీంసాబ్, నాయకులు విఠల్రెడ్డి, బాబూసేట్, మగ్దుంపూర్లో సర్పంచ్ లక్ష్మీనారాయణ, జక్కాపూర్లో సర్పంచ్ కంసవ్వ, బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ బాలయ్య, ఉప సర్పంచ్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండల పరిధిలోని కళ్యాణి, రత్నాపూర్, కొట్టాల్, లక్ష్మాపూర్, తిమ్మాపూర్, తిమ్మాపూర్తండా, వెల్లుట్ల, వెల్లుట్లపేట, వెంకటాపూర్ గ్రామాల్లో పోడు భూముల గ్రామసభలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయ సమావేశ మందిరంలో పోడు భూముల సర్వేపై సబ్ డివిజన్ కమిటీ సభ్యులతో ఆర్డీవో రాజాగౌడ్ శుక్రవారం సమీక్షించారు. ఇప్పటివరకు గ్రామాల్లో పోడు భూములపై నిర్వహించిన గ్రామ సభలు, పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు, దరఖాస్తులను ఆయన పరిశీలించారు. కార్య క్రమంలో డీఎల్పీవో శ్రీనివాస్, ఆయా మండలాల తహసీల్దా ర్లు రాజు, బాబయ్య, గంగాధర్, మద్నూర్ అనిల్కుమార్, ఎంపీడీవోలు రాణి, భానుప్రసాద్, ఆనంద్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.