మెండోరా, అక్టోబర్ 29 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మూసివేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం బాబ్లీ ప్రాజెక్ట్ను మూసివేసినట్లు ఈఈ తెలిపారు. దీంతో క్రమక్రమంగా బాబ్లీ 14 గేట్లను మూసివేశారన్నారు. తిరిగి మార్చి ఒకటో తేదీన తాగు నీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తారని తెలిపారు. కా ర్యక్రమంలో త్రిసభ్య కమిటీ అధికారులు శ్రీనివాస్రావ్, దవనే (నాందెడ్), బావే, డీఈ గణేశ్, ఏఈఈ వంశీ తదితరులున్నారు.
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న స్వల్ప ఇన్ఫ్లో
ప్రాజెక్టులోకి 7,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చే రుతుందని ఈఈ చక్రపాణి తెలిపారు. కాకతీయ కాలువకు 5 వేలు, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కు ల నీటివిడుదల కొనసాగుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉందని తెలిపారు.