డిచ్పల్లి, అక్టోబర్ 28 : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలను రద్దు చేయాలని పాలకమండలి, రాష్ట్ర ఉన్నత విద్యాధికారులు ఆదేశించినప్పటికీ యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యా ర్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఒకసారి నియామకాలు చేశామని, మరోసారి ఉద్యోగులను ఇంటికి పంపిస్తామంటూ వీసీ, రిజిస్ట్రార్లు రోజుకొకమాటతో జిల్లా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. వీసీ, రిజిస్ట్రార్ తీరుపై విద్యార్థి సం ఘాలు, యూనివర్సిటీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో పరిపాలన భవనం ఎదుట గురువారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడు తూ.. యూనివర్సిటీని అవినీతి అక్రమాలకు నిలయం గా మార్చడానికే పూనుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార ప్రజాప్రతినిధు లు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నియామకాలు జరగలేదంటూనే ఇప్పటికీ కొన్ని సెక్షన్లలో కొత్త ఉద్యోగులు పని చేస్తున్నారని అన్నారు. పాలకమండలి సభ్యులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నా యకులు పిల్లి శ్రీకాంత్, రఘురాం, చరణ్, శ్రీనివాస్గౌడ్, ఎల్బి.రవి, లాల్సింగ్, భానుచందర్, జైత్రం, మహేశ్రెడ్డి, సంతోష్ సాయి, కృష్ణ, ప్రేమ్చంద్ పాల్గొన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
టీయూలో అక్రమ నియామకాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విఠల్ డిమాండ్ చేశారు. గురువారం టీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో పలు నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా దొంగచాటుగా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కరోనా సమయంలో యూనివర్సిటీలు బంద్ ఉండడంతో అధికారులు లోలోపలే నియామకాలు చేపట్టారన్నారు. తక్షణమే వాటిని రద్దు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు స్టాలిన్, ప్రవీణ్, భాస్కర్, జిల్లా నాయకులు సుదర్శన్, మనోజ్, కృష్ణ, అనిల్ తదితరులున్నారు.
అక్రమ నియామకాలను రద్దుచేయండి..
ఉన్నత విద్యామండలి కమిషనర్కు పీడీఎస్యూ నాయకుల వినతిపత్రం
డిచ్పల్లి, అక్టోబర్ 28 : టీయూలో 2017 తర్వాత జరిగిన టీచింగ్ (పార్ట్ టైం లెక్చరర్/అకడమిక్ కన్సల్టెంట్) నాన్-టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్కు గురువారం పీడీఎస్యూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకుడు నరేందర్ మాట్లాడుతూ 2017లో జరిగిన అవుట్సోర్సింగ్ నియామకాలు రద్దు చేసిన తర్వాత అప్పటీ వీసీ సాంబయ్య ఉద్యోగ విరమణ చేసే సమయంలో యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు చేపట్టారని తెలిపారు. వాటితో పాటు నేటి వరకు టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకాల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుపాలని, అక్రమ నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.నాగేశ్వర్రావు, రాష్ట్ర కోశాధికారి మహేశ్ తదితరులున్నారు.
డిచ్పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు
డిచ్పల్లి, అక్టోబర్ 28 : టీయూ వీసీ, రిజిస్టార్పై డిచ్పల్లి పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసినట్లు టీయూ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సజ్జనం భానుచందర్ తెలిపారు. ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన స్టేషన్ బయట మాట్లాడారు. వీసీ రవీందర్గుప్తా, రిజిస్ట్రార్ కనకయ్య చేస్తున్న అవినీతి, అక్రమ నియామకాలపై విద్యార్థి సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయన్నారు. ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెంటనే అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినా వీసీ, రిజిస్ట్రార్ పట్టించుకోవడంలేదన్నారు. ఒక కొత్త డ్రామాకు తెర లేపుతూ వర్సిటీ ఉన్నతాధికారులను, పాలకమండలిని బేఖాతర్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇరువురిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.వినతిపత్రం ఇచ్చిన వారిలో టీయూ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు చరణ్, సచిన్, మనీశ్, రాజు ఉన్నారు.