బీర్కూర్/బాన్సువాడ, అక్టోబర్ 27 : మధ్యాహ్న భోజనం వికటించి 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేం ద్రంలో బుధవారం చోటు చేసుకున్నది. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో రోజూ మాదిరిగానే 321 విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కొక్కరికి వాంతులు, కడుపునొప్పి ప్రా రంభమైంది. దీంతో ఉపాధ్యాయులు ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో మండల వైద్యాధికారికి రాజారమేశ్కు సమాచారం అందించారు. సిబ్బంది తో అక్కడి చేరుకున్న ఆయన విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 108 అంబులెన్స్లో బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థులంతా చికిత్స పొందుతున్నారని తహసీల్దార్ రాజు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎస్సై రాజేశ్, రైతు బం ధు సమితి అధ్యక్షుడు అవారి గంగారాం పాఠశాలకు చేరుకొని పరిస్థితిని అడిగి తె లుసుకున్నారు. పాఠశాలకు చేరుకున్న డీఎ ంహెచ్వో కల్పన భోజనం శాంపిళ్లను సేకరించాలని మండల వైద్యాధికారిని ఆదేశించారు.శాంపిళ్లను ల్యాబ్కు పంపిన తర్వాతే కారణాలు తెలుస్తాయన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : స్పీకర్
విద్యార్థులు అస్వస్థతకు గురికావడం చాలా బాధాకరమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాన్సువాడ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పీకర్ వెంట సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, బీర్కూర్ రఘు, జడ్పీటీసీ స్వరూపా శ్రీనివాస్ , ఎంపీటీసీ సందీ ప్ పాటిల్ తదితరులు ఉన్నారు.