ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ చైర్మన్గా లభించే జీతభత్యాలు తనకు వద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కూడా అయిన ఆయన.. శాసనసభ్యుడిగా ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. సంస్థ నష్టాల నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్, నవంబర్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్గా తనకు వచ్చే జీతం వద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. సంస్థ నష్టాల నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి గోవర్ధన్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సాధారణ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఎమ్మెల్యేగా ఆయా ప్రాంతాల్లో పని చేసి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రజల మనసును చూరగొన్నారు. ప్రజల కోసం నిరంతర శ్రామికుడిగా కష్టపడే బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా తనకు లభించే జీతభత్యాలను సంస్థకే వదిలి పెడుతున్నట్లుగా నిర్ణయించారు. శాసనసభ్యుడిగా ప్రభుత్వం నుంచి వచ్చే జీతాన్నే స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించడంతో అభినందన లు వ్యక్తమవుతున్నాయి ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో ఉండడం, అప్పులతోపాటు నిత్యం నష్టాలను చవి చూస్తున్న ప్రస్తుత తరుణంలో సంస్థను బాగు చేసే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఈ మేరకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్కు లిఖిత పూర్వకంగా లేఖ రాయగా ఆయన సమ్మతించారు. ఈ మేరకు చైర్మన్ను అభినందిస్తూ బదులు లేఖను సైతం పంపించారు. అంతేగాకుండా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులంందరూ బాజిరెడ్డి గోవర్ధన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
ఇటు రూరల్.. అటు ఆర్టీసీ…
రాష్ట్రంలో ఆర్టీసీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఆర్టీసీ బస్సు వెళ్లని ఊరంటూ ఉండదు. నిత్యం లక్షలాది మందిని గమ్య స్థానాలకు చేర్చే ప్రభుత్వ రంగ సంస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో భాగంగా ఆర్టీసీకి సారథిగా సరైన వ్యక్తిని నియమించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మక సంస్థకు సెప్టెంబర్ 17న బాజిరెడ్డి గోవర్ధన్ ను చైర్మన్గా నియమించారు. ఎమ్మెల్యేగా సుదీర్ఘకా లంగా కొనసాగుతున్న బాజిరెడ్డి గోవర్ధన్ మూడు నెలలుగా ఆర్టీసీ చైర్మన్గా సేవలు అందిస్తున్నారు. ఓ వైపు రూరల్ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులపై నిరంతరం పర్యవేక్షిస్తూనే ఆర్టీసీని సన్మార్గంలో పెట్టే బాధ్యతను నిర్వహి స్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి చారిత్రా త్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రగతి రథ చక్రాలను నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. సంస్థ పురోగభివృద్ధి కోసం పాటు పడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్కు ఆర్టీసీ చైర్మన్గా వచ్చే జీతం తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. సంస్థను బాగు చేయాలనే ఆలోచనతో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తనకు ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి వచ్చే జీతమే సరిపోతుందని నిర్ణయించుకున్నారు. ఆదర్శవంతమైన నిర్ణయాన్ని వెలువరించి ఆర్టీసీలో ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి సిబ్బందికి స్ఫూర్తిని అందించారు.